నార్త్సౌండ్ (అంటిగ్వా): వెస్టిండీస్, శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్టు ‘డ్రా’గా ముగిసింది. 377 పరుగుల భారీ లక్ష్యఛేదనలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక.. 79 ఓవర్లలో 2 వికెట్లకు 193 పరుగులు చేసింది. కరుణరత్నే (75), ఫెర్నాండో (66 నాటౌట్) రాణించారు. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల సారథులు ‘డ్రా’కు అంగీకరించారు. అంతకుముందు తొలి టెస్టులో కూడా ఫలితం రాకపోవడంతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ 0-0తో ‘డ్రా’గా ముగిసింది.