IND vs WI | పోర్ట్ ఆఫ్ స్పెయిన్: భారత్తో జరుగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మంగళవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. వికెట్ కీపర్ బ్యాటర్ షై హోప్తో పాటు పేస్ బౌలర్ ఒషానె థామస్ ఇందులో చోటు దక్కించుకున్నారు. కరీబియన్ టీమ్కు రావ్మన్ పావల్ సారథ్యం వహించనున్నాడు.
ఇరు జట్ల మధ్య గురువారం టరోబా వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ ఇప్పటికే జట్టును ప్రకటించగా.. సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువ ఆటగాళ్లకు పెద్దపీట వేసింది. తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మ.. విండీస్తో పొట్టి సిరీస్కు భారత జట్టులో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే.