హనుమకొండ చౌరస్తా: తెలంగాణ రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ వేదికగా ఈనెల 26, 27 తేదీల్లో అంతర్జిల్లాల స్విమ్మింగ్ చాంపియన్షిప్ జరుగనుంది. తొలిసారి ఐదు విభాగాల్లో నిర్వహిస్తున్న ఈ స్విమ్మింగ్ పోటీల్లో 250 మంది బాలురు, బాలికలు, 50మంది టెక్నికల్ అధికారులు పాల్గొంటున్నారు. టోర్నీకి సంబంధించిన వివరాలను జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ చైర్మన్ సునీల్రెడ్డి, కార్యదర్శి స్వామిచరణ్ గురువారం మీడియాకు వివరించారు. టోర్నీలో పోటీపడే వారు తప్పనిసరిగా కొవిడ్-19 రిపోర్ట్తో రావాలని నిర్వాహకులు సూచించారు. పోటీలను చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారని తెలిపారు. ఈ టోర్నీలో ప్రతిభ కనబరిచిన స్విమ్మర్లు బెంగళూరులో జరిగే జాతీయ టోర్నీకి ఎంపికవుతారని పేర్కొన్నారు.