Warangal | హనుమకొండ చౌరస్తా: తెలంగాణ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్-15 రెజ్లింగ్ టోర్నీలో వరంగల్ ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన చాంపియన్షిప్లో వరంగల్ 87 పాయింట్లతో టాప్లో నిలువగా, హైదరాబాద్ (81), సంగారెడ్డి (62) ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. ప్లేయర్ల మధ్య కుస్తీ పోటీలు హోరాహోరీగా జరిగాయి. ప్రతీ పాయింట్ కోసం కుస్తీవీరులు నువ్వానేనా అన్నట్లు పోటీపడ్డారు.
గురువారం పోటీలను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు. విజేతలుగా నిలిచిన ప్లేయర్లుకు ఆమె సర్టిఫికేట్లు అందజేసి పతకాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్వో అశోక్కుమార్, రెజ్లింగ్ సంఘం ప్రధాన కార్యదర్శి కరీం, కోశాధికారి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. టోర్నీలో వేర్వేరు విభాగాల్లో నందిని, లావణ్య, మీనాక్షి, నేహాబేగం, పూజ, బాలమణి, సుదీపాసింగ్, సంతోష, గీతాహరిణి, వైశాన్వి పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు.