ముంబై: బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్గా హైదరాబాదీ స్టయిలిష్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఎన్సీఏ మాజీ హెడ్ రాహుల్ ద్రావిడ్.. టీమిండియా కోచ్గా నియమితులైన విషయం తెలిసిందే. దాంతో ఎన్సీఏ హెడ్ పోస్టు ఖాళీ అయ్యింది. ఎన్సీఏ శిక్షణ బాధ్యతలను మాజీ ప్లేయర్ లక్ష్మణ్కు ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షాలు కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. క్రికెట్ ఆట మరింత వైభవాన్ని సంతరించుకోవాలంటే.. మాజీలు తమ అనుభవాల్ని పంచుకోవాల్సి ఉంటుందని గంగూలీ ఇటీవల అభిప్రాయపడ్డారు. ఇండియన్ టీమ్ హెడ్ కోచ్గా రాహుల్ ద్రావిడ్ను ఎంపిక చేయడంలో గంగూలీ కీలక పాత్ర పోషించాడు. అయితే ఎన్సీఏ హెడ్గా ఉన్న ద్రావిడ్ ఆ పోస్టును వీడడంతో ఇప్పుడు అక్కడ ఖాళీ ఏర్పడింది. ఆ స్థానంలో క్లాసిక్ బ్యాటర్ లక్ష్మణ్ను నియమించాలని బీసీసీఐ భావిస్తోంది. నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్గా వ్యవహరించేందుకు లక్ష్మణ్ అంగీకరిస్తే, అప్పుడు భారత క్రికెట్ భవిష్యత్తుకు ఢోకా ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. లక్ష్మణ్ త్వరలోనే తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.