కోల్కతా: జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్గా భారత మాజీ బ్యాటింగ్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ ఈనెల 13న బాధ్యతలు చేపట్టనున్నాడు. ఎన్సీఏ హెడ్గా ఆయనను, బౌలింగ్ కోచ్గా ఇంగ్లండ్ మాజీ కోచ్ ట్రాయ్ కూలి నియామకానికి బీసీసీఐ ఆమోదం తెలిపింది. హెడ్ పోస్టు నియామకానికి ప్రకటన జారీ చేసి నిబంధనల ప్రకారం లక్ష్మణ్ను ఎంపిక చేస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. ఎన్సీఏ డైరెక్టర్గా నియమితమవుతున్న లక్ష్మణ్ ఇప్పటికే సన్రైజర్స్ హైదరాబాద్ మెంటార్ పదవి నుంచి వైదొలిగాడు.