Ireland Series : ఐర్లాండ్తో సిరీస్(Ireland Series)కు ముందు టీమిండియాకు షాక్. జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) నేతృత్వంలోని ఈ మూడు టీ20ల సిరీస్కు వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman) వెళ్లడం లేదు. ఈ విషయాన్ని నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA) ఈరోజు వెల్లడించింది. దాంతో, అతడి స్థానంలో ఎవరు వెళ్లనున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)తో పాటు సహాయక సిబ్బందిలో కొందరు అమెరికా పర్యటనలో ఉన్నారు. దాంతో, ద్రవిడ్ గైర్హాజరీలో లక్ష్మణ్ విండీస్ సిరీస్కు కోచ్గా వ్యవహరిస్తారనే వార్తలు వినిపించాయి.
లక్ష్మణ్ బదులు సితాన్షు కొటక్(Sitanshu Kotak), సాయిరాజ్ బహతులే(Sairaj Bahutule)లు మిగతా సహాయక సిబ్బందితో ఐర్లాండ్కు వెళ్లే అవకాశం ఉంది. ఆగస్టు 15న భారత జట్టు డబ్లిన్కు బయలే దేరనుంది. ఆగస్టు 18వ తేదీన తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది. 20న రెండో, 23వ తేదీన మూడో మ్యాచ్లో ఇరుజట్లు తలపడనున్నాయి.
జస్ప్రీత్ బుమ్రా
వెన్నెముక గాయం నుంచి కోలుకున్న బుమ్రా ఈ సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేయనున్నాడు. ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో కీలకమైన ఈ యార్కర్ కింగ్ ఈ పర్యటనలో ఏ మేరకు రాణిస్తాడు? అనే దానిపై అందరి కళ్లు నిలిచాయి.