హైదరాబాద్: క్రికెట్ రిషబ్ పంత్ను కాపాడిన బస్సు డ్రైవర్ సుశీల్ కుమార్పై ప్రశంసలు కురిపించాడు మాజీ క్రికెటర్, ఎన్సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్. ఉత్తరాఖండ్లోని రూర్కీలోకి పంత్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే కారులో చిక్కుకున్న పంత్ను డ్రైవర్ సుశీల్ కుమార్తో పాటు కండక్టర్ పరమ్జిత్ రక్షించారు. హర్యానా రోడ్వేస్కు చెందిన డ్రైవర్ సుశీల్ రియల్ హీరో అని లక్ష్మణ్ ట్వీట్ చేశాడు. మండుతున్న కారు నుంచి పంత్ను బయటకు తీసి, అతని చుట్టు బెడ్షీట్ చుట్టిన సుశీల్ రియల్ హీరో అన్నాడు.
సుశీల్ అంబులెన్స్కు కూడా కాల్ చేశాడు. మీ నిస్వార్ధ సేవకు మేం రుణపడి ఉన్నామని, రియల్ హీరో సుశీల్ జీ అంటూ లక్ష్మణ్ తన ట్వీట్లో పేర్కొన్నాడు. బస్సు కండెక్టర్ పరమ్జిత్ను కూడా లక్ష్మణ్ మెచ్చుకున్నాడు. స్వార్ధం లేని ఈ వ్యక్తులు ఇద్దరూ గొప్ప హృదయం కలిగినవారని, వాళ్ల సమయస్పూర్తి అమోఘమని, పంత్ను రక్షించినవారందరికీ లక్ష్మణ్ థ్యాంక్స్ తెలిపాడు.
Gratitude to #SushilKumar ,a Haryana Roadways driver who took #RishabhPant away from the burning car, wrapped him with a bedsheet and called the ambulance.
We are very indebted to you for your selfless service, Sushil ji 🙏 #RealHero pic.twitter.com/1TBjjuwh8d— VVS Laxman (@VVSLaxman281) December 30, 2022
బస్సు డ్రైవర్, కండక్టర్లను హర్యానా రోడ్వేస్ సత్కరించింది. హర్యానాలోని పానిపట్ బస్సు డిపో జనరల్ మేనేజర్ కే జాంగ్ర మాట్లాడుతూ.. ఆ ఇద్దర్నీ తాము సత్కరించామని, రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్లను గౌరవిస్తుందని తెలిపారు.