సౌథాంప్టన్: తాతకే దగ్గులు నేర్పే ప్రయత్నం చేశాడు ఓ క్రికెట్ అభిమాని. ఆల్టైమ్ గ్రేట్ స్పిన్నర్లలో ఒకడైన ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వార్న్కు స్పిన్ పాఠాలు చెప్పాడు. ఇది చూసి టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఓ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. అసలేం జరిగిందంటే.. ఇండియా, న్యూజిలాండ్ మధ్య వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ జరుగుతున్న విషయం తెలుసు కదా. ఈ మ్యాచ్కు న్యూజిలాండ్ ఒక్క స్పిన్నర్ను కూడా తీసుకోకుండా బరిలోకి దిగింది. దీనిని తప్పుబడుతూ షేన్ వార్న్ ఓ ట్వీట్ చేశాడు.
ఫైనల్లో న్యూజిలాండ్ స్పిన్నర్ను ఆడించకపోవడం చాలా నిరాశ కలిగించింది. ఈ పిచ్ స్పిన్కు అనుకూలించనుంది. ఇప్పటికే పిచ్పై అడుగుల మరకలు కనిపిస్తున్నాయి. స్పిన్ అయ్యేలా కనిపిస్తోందంటే కచ్చితంగా అవుతుంది. ఇండియా 275/300 కంటే ఎక్కువ చేసిందంటే మ్యాచ్ ముగిసినట్లే అని వార్న్ ట్వీట్ చేశాడు.
దీనికి మక్కా అనే పేరున్న ఓ అభిమాని రిప్లై ఇచ్చాడు. షేన్ అసలు స్పిన్ ఎలా అవుతుందో నీకు తెలుసా? పిచ్ పొడిగా మారితేనే.. కానీ ఇక్కడ వర్షం కారణంగా పిచ్ పొడిగా మారే అవకాశమే లేదు అని ట్వీట్ చేశాడు. ఇది చూసి సెహ్వాగ్ నవ్వాపుకోలేకపోయాడు. షేన్ అసలు స్పిన్ ఎలా అవుతుందో తెలుసుకో అంటూ లాఫింగ్ ఎమోజీలను పెట్టి వీరూ రిప్లై ఇచ్చాడు. ఇప్పుడీ ట్వీట్ వైరల్ అవుతోంది.