స్టావెంజర్: భారత చదరంగ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ హ్యాట్రిక్ విజయం సాధించాడు. నార్వే చెస్ టోర్నీలో వరుసగా మూడో రౌండ్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. హోరాహోరీగా సాగిన క్లాసికల్ విభాగం మూడో రౌండ్లో రష్యా గ్రాండ్ మాస్టర్ వాంగ్ హోపై ఆనంద్ విజయం సాధించాడు. మొదట 39 ఎత్తులతో మ్యాచ్ ‘డ్రా కాగా.. ఈ సందర్భంగా నిర్వహించిన అర్మగెడాన్లో ఆనంద్ 44 ఎత్తులతో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. 7.5 పాయింట్లు తన ఖాతాలో వేసుకుని అగ్రస్థానాన్ని పదిల పర్చుకున్నాడు. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ 5.5 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అంతకుముందు రెండు రౌండ్లలో మాక్సింగ్ లాగ్రావె (ఫ్రాన్స్), వెస్లిన్ తపలోవ్ (బల్గేరియా)ను 52 ఏండ్ల ఆనంద్ చిత్తు చేశాడు.