టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ.. ఐపీఎల్లో తన ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్సీకి గతేడాది వీడ్కోలు పలికాడు. 2013లో కెప్టెన్సీ చేపట్టిన తర్వాత 140 మ్యాచుల్లో ఆర్సీబీకి కెప్టెన్సీ చేసిన కోహ్లీ.. ఈసారి కేవలం ఆటగాడిగానే ఆ ఫ్రాంచైజీతో కొనసాగనున్నాడు. ఈ క్రమంలో భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
ఇటీవల తను కోహ్లీతో మాట్లాడానని చెప్పిన ఈ ఎడమచేతి వాటం స్పీడ్స్టర్తో.. ‘‘నా క్రికెట్ను ఎంజాయ్ చేయాలనుకుంటున్నా. మైదానంలో నా భావాలను ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది’’ అని కోహ్లీ చెప్పాడట. ఈ విషయంలో ఆర్సీబీ పూర్తిగా మద్దతుగా నిలుస్తుందని పఠాన్ అభిప్రాయపడ్డాడు.
‘‘అతను ఈ జట్టుకు కెప్టెన్ కాకపోవచ్చు.. కానీ ఆన్ఫీల్డ్ మెంటార్గా ఉంటాడు. ఈ పాత్రను కోహ్లీ కచ్చితంగా ఎంజాయ్ చేస్తాడని అనుకుంటున్నా. ఇప్పుడు అతను మైదానంలో దిగిన ప్రతిసారీ తన మనసుకు నచ్చినట్లు ఆడుతూ.. తన భావాలను పంచుకోవచ్చు’’ అన్నాడు.
కెప్టెన్గా ఉన్నప్పుడు జట్టు ఫలితంపై చూపు ఉంటుందని.. ప్రత్యర్థి వ్యూహాలు, ఆటగాళ్లు వీటన్నింటి గురించి ఆలోచించాల్సి వస్తుందని ఇర్ఫాన్ వివరించాడు. ఈ బాద్యత లేకపోవడం కోహ్లీకి బాగా నచ్చుతుందన్నాడు. త్వరలోనే మునుపటి కోహ్లీ కనిపిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.