టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. దక్షిణాఫ్రికా కంచు కోట సెంచూరియన్లో టెస్టు మ్యాచ్ నెగ్గాడు. ఇక్కడ టెస్టు మ్యాచ్ గెలిచిన తొలి ఆసియన్ కెప్టెన్గా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ విజయం అనంతరం భారత జట్టు సంబరాల్లో మునిగిపోయింది. కోహ్లీ కూడా విజయాన్ని ఆస్వాదించాడు.
ఈ క్రమంలోనే స్టాండ్స్లో ఉన్న తన భార్య అనుష్క, కుమార్తె వామికలను మైదానంలో నుంచి పలకరించాడు. కుమార్తె వామికను చూస్తూ చేతులూపుతూ.. గాల్లో పంచెస్ ఇస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత జట్టు మొత్తం కలిసి డ్రెస్సింగ్ రూం చేరింది.
మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. జట్టుకు అదిరే ఆరంభం అందించిన రాహుల్, మయాంక్లను మెచ్చుకున్నాడు. ప్రపంచంలోని టాప్ 3 అత్యుత్తమ పేసర్లలో మహమ్మద్ షమీ ఒకడని కొనియాడాడు. అలాగే సఫారీల తొలి ఇన్నింగ్స్లో బుమ్రా ఎక్కువ బౌలింగ్ చేయకపోవడం వల్ల సౌతాఫ్రికా 40 పరుగుల వరకూ అదనంగా చేయగలిగిందని చెప్పాడు.