ముంబై: భారత క్రికెట్ జట్టు కోచ్ రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరున్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ల అయిదేళ్ల పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ వారందరికీ థ్యాంక్స్ చెబుతూ ఇవాళ ఓ ట్వీట్ చేశారు. టీ20 కెప్టెన్సీ నుంచి కూడా విరాట్ తప్పుకున్న విషయం తెలిసిందే. ఒక జట్టుగా అందరితో కలిసి అద్భుతమైన ప్రయాణం సాగించానని, ఆ జ్ఞాపకాలు సుమధురమని కోహ్లీ తన ట్వీట్లో చెప్పారు. మీరు అందించిన తోడ్పాటు చాలా విలువైందని, భారత క్రికెట్ చరిత్రలో అది నిలిచిపోతుందన్నారు. జీవితంలో మీరు మరింత ప్రగతి సాధించాలని కోహ్లీ తన ట్వీట్లో ఆశాభావం వ్యక్తం చేశారు. టీమిండియా కోచ్గా రవిశాస్త్రి ఉన్న సమయంలో.. భారత జట్టు 43 టెస్టులు ఆడింది. దాంట్లో 25 మ్యాచుల్లో నెగ్గా, మరో 13 మ్యాచుల్లో ఓటమి పాలైంది. ఇక రవిశాస్త్రి కోచ్గా ఉన్నప్పుడు 76 వన్డేలు, 65 టీ20 మ్యాచ్లను ఇండియా ఆడింది. దాంట్లో 51 వన్డేలు, 43 టీ20ల్లో భారత జట్టు నెగ్గింది.
Thank you for all the memories and the amazing journey we've had as a team with you all. Your contribution has been immense and will always be remembered in Indian cricket history. Wish you the best moving forward in life. Until next time ⭐🤝 pic.twitter.com/42hx4Q7cfq
— Virat Kohli (@imVkohli) November 10, 2021