ముంబై: వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్తో జరుగుతున్న వరల్డ్కప్ సెమీస్ మ్యాచ్లో.. విరాట్ కోహ్లీ తృటిలో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రోహిత్ శర్మ ఔటైన తర్వాత క్రీజ్లోకి వచ్చిన విరాట్.. కొన్ని బంతుల తేడాలోనే ఎల్బీడబ్ల్యూ ఔట్ అయ్యేవాడు. బంతి విరాట్ ప్యాడ్స్ తగిలినట్లు అనిపించినా… అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు. దీంతో కివీస్ కెప్టెన్ విలియమ్స్న్.. డీఆర్ఎస్ తీసుకున్నాడు. సౌథీ బౌలింగ్లో బంతి ముందుగా విరాట్ ప్యాడ్స్కు తగిలినట్లు తేలింది. దీంతో విరాట్ నాటౌట్గా నిలిచాడు. అయితే మ్యాచ్ను వీక్షించేందుకు వచ్చిన అతని భార్య అనుష్కా శర్మ(Anushka Sharma).. ఆ సమయంలో ప్రేక్షకుల గ్యాలరీలోనే ఉన్నది. కోహ్లీ డీఆర్ఎస్ నుంచి బయటపడడంతో.. అనుష్కా ఊపిరిపీల్చుకున్నది. ఆ ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతోంది.
MOOD EVERY BALL pic.twitter.com/g0CSMbObCj
— adi. (@aaditeaa) November 15, 2023