న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో జరగనున్న మిగితా మూడు టెస్టులకు కూడా విరాట్ కోహ్లీ(Virat Kohli) దూరం కానున్నారు. ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్టుల్లో రెండు జట్లూ చెరో పాయింట్ నెగ్గి సమంగా ఉన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి రాజ్కోట్లో మూడవ టెస్టు ప్రారంభంకానున్నది. వ్యక్తిగత కారణాల వల్ల తొలి రెండు టెస్టులకు కోహ్లీ దూరమైన విషయం తెలిసిందే.
ఇక మిగిలిన మూడు టెస్టులకు కూడా కోహ్లీ దూరంగా ఉంటారని బీసీసీఐ తెలిపింది. కోహ్లీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. మూడవ మ్యాచ్ కోసం సీనియర్ క్రికెటర్లు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అయితే మెడికల్ టీమ్ ఇచ్చే రిపోర్టు ఆధారంగా ఆ ఇద్దరూ తుది జట్టులో ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇద్దరూ తొడకండరాల సమస్యతో బాధపడుతన్నారు.
సీనియర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్కు రెస్టు ఇచ్చారు. గజ్జల్లో నొప్పి ఉన్నట్లు అతను ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కొత్తగా ప్రకటించిన ఆటగాళ్ల జాబితాలో స్పీడ్ బౌలర్ ఆకాశ్ దీప్కు చోటు దక్కింది. బెంగాల్కు ఆడే ఆకాశ్ దీప్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్తో పాటు ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ లయన్స్ టెస్టు సిరీస్లో రాణించాడు. అవేశ్ ఖాన్ స్థానంలో సిరాజ్ ఆడనున్నాడు.
🚨 NEWS 🚨#TeamIndia‘s Squad for final three Tests against England announced.
Details 🔽 #INDvENG | @IDFCFIRSTBankhttps://t.co/JPXnyD4WBK
— BCCI (@BCCI) February 10, 2024