VVS on Kohli | టీం ఇండియా సారధి విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఫామ్ అందుకోవడానికి ఓపిక పట్టాలని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సూచించాడు. కొద్దికాలంగా కోహ్లీ ట్రిపుల్ డిజిట్స్ స్కోర్ చేయకుండానే ఔటవుతున్నారని చెప్పారు. ఆయన ఆటలో ఎటువంటి వంటి టెక్నికల్ లోపాల్లేవన్నాడు. సెంచరీ కరువుతీర్చుకోవడానికి ఆయన ఓపిక పట్టాలని హితవు చెప్పాడు. త్వరలో ఒక సెంచరీ చేస్తే గతంలో మాదిరిగా భారీగా పరుగులు చేస్తాడని స్పష్టం చేశాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో కివీస్తో రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన కోహ్లీ.. రెండో ఇన్నింగ్స్లో 36 పరుగులు చేశాక పెవిలియన్ ముఖం పట్టాడు.
కానీ కివీస్ చివరి టెస్ట్లో కలిసి వచ్చిన శుభారంభాన్ని భారీ స్కోర్గా మల్చడంలో ఛతేశ్వర్ పుజారా విఫలం అయ్యాడు. ఓపెనర్గా 47 పరుగులతో ఔటయ్యాడు. దీనిపైనా వీవీఎస్ స్పందించాడు. టెస్ట్ల్లో పుజారా సెంచరీ చేసి చాలా రోజులైందని, తాజాగా మంచి చాన్స్ మిస్ చేసుకున్నాడని వ్యాఖ్యానించాడు. మూడో స్థానంలో వచ్చే పుజారా.. ఓపెనర్గా వచ్చినా కాన్ఫిడెంట్గా బ్యాటింగ్ చేశాడన్నాడు. కానీ 47 పరుల వద్ద ఔట్ కావడంతో పుజారా నిరుత్సాహానికి గురై ఉంటాడని, కానీ సెంచరీ కోసం కొన్ని రోజులు వేచి చూడక తప్పదన్నాడు.