తొలి టెస్టులో ఒక్క బంతి కూడా పడకుండానే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) చరిత్ర సృష్టించాడు. సెంచూరియన్లోని సూపర్ స్పోర్ట్ పార్క్లో తొలి టెస్టు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కోహ్లీ అద్భుతమైన రికార్డు తిరగరాశాడు. టెస్టుల్లో కోహ్లీ టాస్ గెలవడం ఇది 30వ సారి.
ఇంతకుముందు టెస్టు క్రికెట్లో అత్యధిక సార్లు టాస్ గెలిచిన భారత కెప్టెన్గా మహమ్మద్ అజారుద్దీన్ పేరిట ఈ రికార్డు ఉండేది. దీన్ని కోహ్లీ తిరగరాశాడు. కోహ్లీ ఇలా టాస్ గెలిచిన చివరి 29 మ్యాచుల్లో భారత జట్టు 23సార్లు విజయం రుచిచూసింది. దీంతో ఈ మ్యాచ్లో కూడా ఫలితం భారత్కు అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.