Virat Kohli | ఇండియన్స్ క్రికెట్ ఆరాధ్య దైవం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. కానీ ఇప్పుడు ఆయన రికార్డులను తిరగ రాశాడు విరాట్ కోహ్లీ.. ప్రపంచ కప్ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 200 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగింది టీం ఇండియా.. కానీ రెండు ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోవడంతో రోహిత్ సేన కష్టాల్లో చిక్కుకున్నది.
ఈ తరుణంలో బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ కోహ్లీ.. కేఎల్ రాహుల్ తో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చడంలో కీలకంగా వ్యవహరించాడు. 116 బంతులకు 85 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. మొత్తం 92 మ్యాచ్ల్లో 5,517 పరుగులు చేశాడు. కోహ్లీ సగటు పరుగులు 88.98. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ 124 మ్యాచ్ల్లో 5490 పరుగులు చేసిన రికార్డు సొంతం చేసుకున్నాడు. కానీ విరాట్ కోహ్లీ కేవలం 92 మ్యాచ్ల్లోనే సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు.