Virat kohli | టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో మైలురాయిని అందుకున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ ఆల్ టైం రికార్డును బద్దలుకొడుతూ.. అంతర్జాతీయ క్రికెట్లో 25 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో కోహ్లీ ఈ ఘనతను సాధించాడు. మూడో రోజు ఆటలో భాగంగా నాథన్ లయన్ బౌలింగ్లో కోహ్లీ ఫోర్ కోట్టి 25 వేల మార్కును అందుకున్నాడు.
ఇంకేవరంటే
సచిన్ 577 మ్యాచ్లకు 25 వేల రన్స్ చేయగా.. విరాట్ కేవలం 549 మ్యాచ్లతో ఈ రికార్డును చేరుకున్నాడు. సచిన్ తర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాటింగ్ (588 మ్యాచ్ లు), దక్షిణాఫ్రికా ఆటగాడు జకస్ కల్లిస్ (594), శ్రీలంక మాజీ కెప్టెన్లు కుమార సంగక్కర (608), మహేల జయవర్దనె (701) ఉన్నారు.
భారత్ ఘన విజయం
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో అసీస్ను మట్టి కరిపించి సిరీస్లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. గెలుపు కోసం కేవలం 113 పరుగులు కావాల్సిన స్థితిలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ 26.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మ వేగంగా ఆడి 20 బంతుల్లోనే 31 పరుగులు చేసి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు.
Yet another milestone to Virat Kohli’s name ⭐#WTC23 | #INDvAUS pic.twitter.com/XnnNZneik3
— ICC (@ICC) February 19, 2023