ఉజ్జెయిని: టీమిండియా క్రికెటర్లు కొందరు ఇవాళ ఉజ్జయిని మహాకాలేశ్వరుడి(Mahakaleshwar Temple) సేవలో పాల్గొన్నారు. బోలేనాథుడికి నిర్వహించే భస్మ హారతిలో పాల్గొన్నారు. మేటి బ్యాటర్ విరాట్ కోహ్లీ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్తో పాటు మరికొంత మంది క్రికెటర్లు మహాశివుడి దర్శనం చేసుకున్నారు. టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ కూడా ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.
న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ఆడుతున్న కోహ్లీ.. ఇండోర్లో ఆదివారం జరగనున్న మూడవ వన్డే కోసం రెఢీ అయ్యాడు. అయితే ఇవాళ ఉదయం 4 గంటలకు కొందరు క్రికెటర్లు మహాకాలేశ్వరుడి సన్నిధానికి విచ్చేశారు. నంది హాల్లో కూర్చున్న క్రికెటర్లకు పూజారులు తిలకం దిద్దారు. సుమారు రెండు గంటలకు పైగా కోహ్లీ, కుల్దీప్ భస్మ హారతిలో పాల్గొన్నారు. ఆ క్రికెటర్లకు నుదుటిపై పూజారుల గంధం పూశారు.
టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్, వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా మహాకాలేశ్వరుడి ఆశీస్సులు తీసుకున్నారు. జై శ్రీ మహాకాల్ అంటూ విరాట్ కోహ్లీ అన్నారు. మహాకాల్ ఆలయానికి రావడం సంతోషాన్ని ఇచ్చినట్లు కుల్దీప్ చెప్పాడు. టీ20 వరల్డ్కప్లో రాణించే విధంగా ఆ దేవుడిని ప్రార్థించినట్లు తెలిపాడు.
#WATCH | Madhya Pradesh | Former Indian Captain and Star Cricketer Virat Kohli, along with Kuldeep Yadav, offered prayers at Shree Mahakaleshwar Temple in Ujjain. pic.twitter.com/GirLTB7j6I
— ANI (@ANI) January 16, 2026