లక్నో: కామన్వెల్త్ క్రీడలకు సాక్షి మాలిక్ (62 కిలోలు), వినేశ్ ఫొగట్ (53 కి)తో సహా ఆరుగురితో కూడిన జట్టును ఎంపిక చేశారు. లక్నో వేదికగా సోమవారం నిర్వహించిన జాతీయ ట్రయల్స్లో విజేతలుగా నిలిచిన వారు కామన్వెల్త్ క్రీడల్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. జూలై 28 నుంచి బర్మింగ్హామ్లో జరుగనున్న మెగాటోర్నీలో భారత రెజ్లర్లు పూజా గెహ్లాట్ (50 కి), వినేశ్ ఫొగట్ (53 కి), అన్షు (57 కి), దివ్య కక్రాన్ (68 కి), పూజ (76 కి) ఆయా కేటగిరీల్లో బరిలోకి దిగనున్నారు. పురుషుల ట్రయల్స్ మంగళవారం జరుగనున్నాయి.