నోమి(జపాన్): ప్రతిష్ఠాత్మక పారిస్ (2024) ఒలింపిక్స్తో పాటు ప్రపంచ చాంపియన్షిప్ టోర్నీకి భారత యువ అథ్లెట్లు వికాస్సింగ్, పరమ్జీత్సింగ్ బిస్త్ అర్హత సాధించారు. ఆసియా చాంపియన్షిప్లో భాగంగా ఆదివారం జరిగిన పురుషుల 20కి.మీల రేస్ వాకింగ్లో వికాస్ (1:20:05సె), పరమ్జీత్ (1:20:08సె) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
చైనా రేసర్ క్వియాన్ హఫెంగ్ (1:19:09సె) అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఇప్పటికే పారిస్ విశ్వక్రీడల బెర్తు ఖరారు చేసుకున్న ఆకాశ్దీప్సింగ్ (1:20:57సె) ఓవరాల్గా ఐదో స్థానంలో నిలిచాడు.