న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చైర్మన్ బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్కు వ్యతిరేకంగా భారత రెజ్లర్లు ఆందోళనకు దిగారు. బ్రిజ్ భూషన్ రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్ పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. వారికి మద్దతుగా ఇవాళ ఒలింపియన్ బాక్సర్, కాంగ్రెస్ నాయకుడు విజేందర్ సింగ్ ఆందోళనలో పాల్గొన్నాడు.
రెజ్లర్లతో కలిసి నిరసన వేదికపై బైఠాయించారు. ఈ సందర్భంగా కొందరు రెజ్లర్లు ఆయన వేదిక దిగిపొమ్మన్నారు. విజేందర్ రాజకీయ నాయకుడు కాబట్టి తమ సమస్యను రాజకీయం చేయడం తమకు ఇష్టం లేదని వారు చెప్పారు. దాంతో విజేందర్ వేదిక దిగి కిందకు వచ్చారు. కిందనే మరికొందరితో కలిసి బైఠాయించి రెజ్లర్లకు మద్దతు తెలిపారు.