డంబుల్లా: శ్రీలంకతో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్-ఏ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) ఇవాళ ఆఫ్ఘనిస్తాన్-ఏ బౌలర్లను కాసేపు వణకించాడు. తొలుత టాస్ గెలిచి ఆఫ్ఘనిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నది. అయితే ఓపెనర్ సూర్యవంశీ ఇవాళ కొన్ని భీకర షాట్లతో చెలరేగాడు. 15 ఏళ్ల ఆ బ్యారట్ కేవలం 22 బంతుల్లో 44 రన్స్ చేశాడు. దాంట్లో 9 ఫోర్లు ఉన్నాయి. ఇక స్ట్రయిక్ రేట్ ఏకంగా 200 ఉంది. హాఫ్ సెంచరీకి చేరువైన సమయంలో వైభవ్ ఔటయ్యాడు.
ఆరంభం నుంచి మ్యాచ్లో వైభవ్ ఎక్కువ బృంతుల్ని వృధా చేయలేదు. తొలి బంతికే అతను ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత అదే ఊపులో బ్యాటింగ్ కొనసాగించాడు. భారత్-ఏ జట్టు తొలి అయిదు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 50 రన్స్ చేసింది. ఆఫ్సైడ్లో అతను గ్యాప్స్ చూసి మంచి షాట్స్ ఆడాడు. షార్ట్ పిచ్ బంతుల్ని ఈజీగా కొట్టేశాడు.
తొలి వికెట్కు ప్రభుసిమ్రన్ సింగ్తో కలిసి 74 రన్స్ జోడించారు. ఈ మ్యాచ్లో ప్రభుసిమ్రన్ 84 రన్స్ చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్లో 14 బౌండరీలు ఉన్నాయి. మాజీ ప్లేయర్ అజయ్ జడేజా అతని బ్యాటింగ్పై ప్రశంసలు కురిపించాడు. ప్రియాన్ష్ ఆర్యా 8 రన్స్కే ఔటయ్యాడు.
ప్రస్తుతం ఇండియాఏ జట్టు 38 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 రన్స్ చేసింది. రుతురాజ్ 66 రన్స్ చేసి ఔటయ్యాడు. తిలక్ వర్మ క్రీజ్లో ఉన్నాడు.
It’s Vaibhav Suryavanshi show against Afghanistan 👏
Vaibhav Sooryavanshi smashed 44 runs in just 22 balls vs Afghanistan A which included 9 fours at an strike rate of 200 💥
This 15 year old kid is just phenomenal and nightmare for the bowlers 🫡pic.twitter.com/wrRLpUezgS
— Ajay Jadeja (@AjayJadeja171) June 11, 2026