దుబాయ్: తొలిసారి నిర్వహించిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్లో దుమ్మురేపిన ముగ్గురు భారత అమ్మాయిలకు ఐసీసీ వరల్డ్కప్ జట్టులో చోటు దక్కింది.
కెప్టెన్ షఫాలీ వర్మతో పాటు ఓపెనర్ శ్వేత షెరావత్, లెగ్ స్పిన్నర్ పార్శవి చోప్రా ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నారు. షఫాలీ, శ్వేత బ్యాట్తో విధ్వంసం సృష్టించగా.. పార్శవి తన స్పిన్తో ప్రత్యర్థులను బెంబేలెత్తించింది.