లండన్ : బంగ్లాదేశ్తో మ్యాచ్లో శ్రీలంక బ్యాటర్ మాథ్యూస్ను అంపైర్లు టైమ్ అవుట్గా తీసుకున్న నిర్ణయం సరైందేనని మెర్ల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) సమర్ధించింది. మాథ్యూస్ కొత్త హెల్మెట్కోసం అంపైర్లను సంప్రదించి ఉండాల్సిందని ఎంసీసీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
అంతర్జాతీయ క్రికెట్లో టైమ్ అవుట్గా వెనుదిరిగిన తొలి బ్యాటర్గా మాథ్యూస్ నిలిచిన విషయం తెలిసిందే.