IND vs AUS : భారత్ (TeamIndia) ఆఖరి సెషన్లో వెంట వెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. ఉమేష్ యాదవ్ (0) రనౌట్ అయ్యాడు. రెండో రన్ కోసం ప్రయత్నించి ఔట్ అయ్యాడు. పీటర్ హ్యాండ్స్కాంబ్ త్రో చేయడంతో మర్ఫీ వికెట్లను గిరాటేశాడు. దాంతో, 569 వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. అంతకు ముందు లియాన్ (Lyon) ఓవర్లో రవిచంద్రన్ అశ్విన్ (7) ఔట్ అయ్యాడు. అక్షర్ పటేల్ (79) ఔట్ కావడంతో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ ఓవర్లో అక్షర్ బౌల్డ్ అయ్యాడు. దాంతో, 556 పరుగుల వద్ద అసీస్కు బ్రేక్ లభించింది. కోహ్లీ(185 నాటౌట్)తో కలిసి అక్షర్ మరోసారి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.
వీళ్లిద్దరూ ఆరో వికెట్కు 162 పరుగులు జోడించారు. ప్రస్తుతం కోహ్లీ 180, అశ్విన్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ ప్రస్తుతం 80 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆసీస్ బౌలర్లలో లియాన్, మర్ఫీ రెండేసి వికెట్లు తీశారు. కునేమాన్, స్టార్క్ తలా ఒక వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 480 రన్స్కు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.