Umesh Yadav : భారత ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ తన మేనేజర్, స్నేహితుడి చేతిలో మోసపోయాడు. నాగ్పూర్లో భూమి కొనేందుకు ఉమేశ్ తన మేనేజర్ శైలేష్ థాక్రేకు రూ.44 లక్షలు ఇచ్చాడు. అయితే.. ఆ డబ్బుతో శైలేష్ తన పేరుతో ప్లాట్ కొనుకున్నాడు. విషయం తెలిసిన ఉమేశ్అతడిని నిలదీశాడు. ఆ ఫ్లాట్ను తన పేర రాయించాలని లేదా తన డబ్బులు తిరిగి ఇవ్వాలని శైలేష్కు చెప్పాడు. అంతుకు అతను నిరాకరించాడు. దాంతో, ఉమేశ్ కోరాడీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శైలేష్పై 406 (నమ్మకద్రోహం), 420 (చీటింగ్)సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే.. ఇప్పటివరకైతే పోలీసులు శైలేష్ను అరెస్ట్ చేయలేదు.
‘నాగ్పూర్లో ఉమేశ్ స్థలం కొనాలి అనుకున్నాడు. ఈ విషయాన్ని శైలేష్కు చెప్పాడు. అతను ఉమేశ్కు బీడువారిన స్థలం చూపించి రూ.44 లక్షలు ఖర్చవుతుందని చెప్పాడు. దాంతో ఉమేశ్, అతడి బ్యాంక్ అకౌంట్కు మొత్తం డబ్బు పంపించాడు. అయితే.. శైలేష్ ఆ స్థలం కొనకుండా తన పేరుతో ఫ్లాట్ కొనుక్కున్నాడు. మేనేజర్ అయ్యాక శైలేష్ థాక్రే ఉమేశ్కు నమ్మినబంటులా ఉండేవాడు. ఉమేశ్ బ్యాంక్ ఖాతాతో పాటు ఆదాయపు పన్ను, ఇతర ఆర్థిక వ్యవహారాలను కూడా అతనే చక్కబెట్టేవాడు’ అని పోలీసులు తెలిపారు. శైలేష్ది కొరాడీ ప్రాంతం. భారత జట్టుకు ఉమేశ్ యాదవ్ ఎంపికయ్యే సరికి నిరుద్యోగి. దాంతో, శైలేష్ను 2014 జూలై 15న ఉమేశ్ తన మేనేజర్గా నియమించుకున్నాడు.