ఆర్హుస్: భారత యువ బ్యాడ్మింటన్ జట్టు ఉబెర్ కప్ ఫైనల్లో బోణీ కొట్టింది. సీనియర్ ప్లేయర్ సైనా నెహ్వాల్ గాయం కారణంగా మధ్యలోనే వైదొలిగినా.. మిగిలినవాళ్లు సత్తా చాటడంతో తొలి పోరులో భారత 3-2తో స్పెయిన్పై గెలిచింది. ఆదివారం జరిగిన గ్రూప్-బి టైలో భారత్ తరఫున మాళవిక, అదితి సింగిల్స్లో విజయాలు సాధించగా.. డబుల్స్లో రుతుపర్ణ-తనీశా జోడీ గెలుపొందింది.