హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక ప్రపంచ స్కూల్ చెస్ టోర్నీకి రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల (టీఎస్డబ్ల్యూర్ఈఐఎస్) పాఠశాల విద్యార్థి మాస్టర్ ఆకాశ్ కుమార్ అర్హత సాధించాడు. గ్రీస్ వేదికగా ఏప్రిల్ 13 నుంచి 23 వరకు జరిగే టోర్నీలో భారత్ తరఫున ఆకాశ్ బరిలోకి దిగనున్నాడు.
ప్రస్తుతం షేక్పేట గురుకులంలో పదో తరగతి చదువుతున్న ఆకాశ్ అండర్-17 విభాగంలో 18వ స్థానంలో నిలువడం ద్వారా మెగాటోర్నీ బెర్తు దక్కించుకున్నాడు.