హైదరాబాద్, ఆట ప్రతినిధి: సౌత్ జోన్ గోల్ఫ్ టోర్నీలో గురుకుల విద్యార్థులు సత్తాచాటారు. చెన్నై వేదికగా జరిగిన జాతీయ స్థాయి టోర్నీలో అమూల్య, అనూష విజేతలుగా నిలువగా.. మరో ఐదుగురికి పతకాలు దక్కాయి. బాలికల వేర్వేరు విభాగాల్లో జి. అమూల్య, ఎం. అనూష అగ్రస్థానం దక్కించుకోగా.. అఖిల, ప్రిసిల్లా, హరిత రాణి, నవీన మెడల్స్ గెలుచుకున్నారు. బాలుర విభాగంలో ముకుల్ మూడో స్థానంలో నిలిచాడు. పతకాలు సాధించిన యువ గోల్ఫర్లను గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రాస్ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.