హైదరాబాద్: రాజస్థాన్ వేదికగా జరిగిన జాతీయ సబ్జూనియర్, జూనియర్ పవర్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన మహమ్మద్ రబ్బానీ పసిడి పతకంతో మెరిశాడు.
బాలుర సబ్ జూనియర్ 53కిలోల విభాగంలో బరిలోకి దిగిన రబ్బానీ స్కాట్లో 165.0 కిలోలు, బెంచ్ప్రెస్లో 77.5 కిలోలు, డెడ్లిఫ్ట్లో 187.5 కిలోలు.. మొత్తంగా 430.0 కిలోలు ఎత్తి టాప్లో నిలిచాడు. పసిడి పతక ప్రదర్శన ద్వారా ఈనెల 20 నుంచి విశాఖపట్నంలో జరిగే సౌత్ఇండియా సబ్ జూనియర్, జూనియర్ టోర్నీకి రబ్బానీ ఎంపికైనట్లు కోచ్ ఆనంద్రాజ్ పేర్కొన్నాడు.