హైదరాబాద్: గత ఏడాది కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కార్ .. హైదరాబాద్లో ఈరేస్ను అద్భుతంగా నిర్వహించింది. అయితే ఈ ఏడాది జరగాల్సిన ఆ రేస్ను రద్దు చేశారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేస్ నిర్వాహక సంస్థ అగ్రిమెంట్ను రద్దు చేసింది. దీంతో ఫిబ్రవరి 10వ తేదీ జరగాల్సిన ఈవెంట్ రద్దు అయ్యింది. ఈ అంశంపై ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) రియాక్ట్ అయ్యారు. ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్లో స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పేలవంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడమే అని, ఇది తిరోగమన నిర్ణయమన్నారు.
హైదరాబాద్ ఈ ప్రీ ఈవెంట్తో మన నగరానికి బ్రాండ్ ఇమేజ్ వచ్చిందని, ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి గుర్తింపు కూడా వచ్చినట్లు కేటీఆర్ తన ఎక్స్ అకౌంట్లో పేర్కొన్నారు. ఎంతో శ్రమ, సమయాన్ని కేటాయించి ఫార్ములా ఈ ఈవెంట్ను ఇండియాకు తీసుకువచ్చినట్లు ఆయన గుర్తు చేశారు.
సుస్థిరతే లక్ష్యంగా ప్రపంచ దేశాలు ముందుకు వెళ్తున్నాయని, ఆ ఉద్దేశంతోనే కేసీఆర్ ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ను నిర్వహించిందన్నారు. ఆ రేస్ కారణంగా ఈవీ సదస్సును కూడా నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఎలక్ట్రానిక్ వెహికిల్స్ ఔత్సాహికులు, ఉత్పత్తిదారులు, స్టార్టప్లు.. పెట్టుబడులకు హైదరాబాద్ను అనువైన ప్రదేశంగా గుర్తించాయని ఆయన అన్నారు. సస్టేనబుల్ మొబిలిటీ సొల్యూషన్స్ కేంద్రంగా హైదరాబాద్ను మార్చామని, దానిలో భాగంగానే తెలంగాణ మొబిలి వాలీ ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ వెల్లడించారు.
This is truly a poor and regressive decision by the Congress Government
Events like Hyderabad E-Prix enhance the brand image of our City and Country across the world. We had put in a lot of effort and time to bring Formula E-Prix for the first time to India 🇮🇳
In a world… https://t.co/8tCIBEcgB5
— KTR (@KTRBRS) January 6, 2024