హైదరాబాద్, ఆట ప్రతినిధి : తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్(టీపీజీఎల్)లో సెమీఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. టీమ్ టీఆఫ్ ఫెయిర్మౌంట్, వ్యాలీ వారియర్స్, రిట్జ్ మాస్టర్స్, గోల్డెన్ ఈగల్స్ సెమీస్లోకి దూసుకెళ్లాయి. ఆటమ్ చార్జర్స్ 2-4తో టీమ్ టీఆఫ్ ఫెయిర్మౌంట్ చేతిలో ఓటమిపాలైంది. మిగతా క్వార్టర్స్లో వ్యాలీ వారియర్స్ 3-3తో టీమ్ దాసోస్పై, రిట్జ్ మాస్టర్స్ 3.5-2.5తో ఎమ్వైకే స్ట్రైకర్స్పై, గోల్డెన్ ఈగెల్స్ 4-2తో టీమ్ ఎమ్వైఎస్ఏపై విజయం సాధించాయి.