హైదరాబాద్, ఆట ప్రతినిధి: గచ్చిబౌలి స్టేడియం వేదికగా హైదరాబాద్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన టోర్నీలో యువ స్ప్రింటర్ నందిని పసిడి పతకంతో మెరిసింది. ఆదివారం మహిళల 100మీటర్ల రేసును నందిని 11.8 సెకన్లలో ముగించి స్వర్ణాన్ని సొంతం చేసుకుంది.
మరోవైపు పురుషుల 100మీ. విభాగంలో శ్రీనివాస్ (10.6సె) స్వర్ణం సొంతం చేసుకున్నాడు. పోటీల ముగింపు కార్యక్రమానికి సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘క్రీడల ద్వారా ఆరోగ్యం మాత్రమే కాదని, సమజానికి ఉత్సాహవంతులైన ప్రతిభావంతులు లభిస్తారు. సీఎం కేసీఆర్ అన్ని రంగాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్టే క్రీడలకు అండగా నిలుస్తున్నారు’ అని అన్నారు.