పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో టాప్ సీడ్ స్వియాటెక్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్ 6-4, 6-2తో అమెరికా యువ సంచలనం, ఆరో సీడ్ కొకొ గాఫ్పై విజయం సాధించింది. నిరుడు ఈ ఇద్దరి మధ్య జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లోనూ స్వియాటెక్ చేతిలో గాఫ్ పరాజయం కాగా.. గాఫ్పై స్వియాటెక్కు ఇది ఏడో విజయం. గంటన్నర పాటు సాగిన పోరులో 19 విన్నర్లు కొట్టిన స్వియాటెక్.. 4 బ్రేక్ పాయింట్లు సాధించింది. టోర్నీ ఆసాంతం రాణించిన గాఫ్.. క్వార్టర్స్లో కఠిన ప్రత్యర్థి ముందు తేలిపోయింది. పదే పదే అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది.
మరో క్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్కు చెందిన హద్దద్ మైయా 3-6, 7-6 (7/5), 6-1తో జాబుర్పై గెలుపొందింది. ఈ విజయంతో మైయా 55 ఏండ్ల తర్వాత గ్రాండ్స్లామ్ సెమీస్ చేరిన బ్రెజిల్ ప్లేయర్గా రికార్డుల్లోకెక్కింది. పురుషుల సింగిల్స్లో టాప్ సీడ్ కార్లస్ అల్కరాజ్ 6-2, 6-1, 7-6 (7/5)తో ఐదో సీడ్ సిట్సిపాస్పై గెలుపొందాడు. స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ గైర్హాజరీలో టైటిల్ పట్టాలని తహతహలాడుతున్న అల్కరాజ్.. సెమీఫైనల్లో మూడోసీడ్ నొవాక్ జొకోవిచ్తో తలపడనున్నాడు. మరో క్వార్టర్స్ పోరులో అలెగ్జాండర్ జ్వెరెవ్ 6-4, 3-6, 6-3, 6-4తో థామస్ మార్టీన్పై గెలిచి సెమీఫైనల్లో అడుగుపెట్టాడు.