ఛటోగ్రామ్(బంగ్లాదేశ్): బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక భారీ స్కోరు దిశగా సాగుతున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక తొలి రోజు శనివారం ఆట ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. బంగ్లా బౌలింగ్ను అలవోకగా ఎదుర్కొంటూ లంక బ్యాటర్లు పరుగులు కొల్లగొట్టారు. కుశాల్ మెండిస్(93), దిముత్ కరుణరత్నె (86), నిశాన్ మదుశనక (57) అర్ధసెంచరీలతో రాణించారు. మదుశనక, కరుణరత్నె..లంకకు మెరుగైన శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్కు 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మిడిలార్డర్లో కుశాల్ కూడా విజృంభించడంతో లంకకు భారీ స్కోరు వైపు అడుగులు వేస్తున్నది. హసన్ (2/64) రెండు వికెట్లు పడగొట్టాడు. దినేశ్ చండిమల్ (34), కెప్టెన్ ధనంజయ డిసిల్వా (15) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు.