న్యూఢిల్లీ: టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్లో భారత క్రీడాకారుల జోరు కొనసాగుతున్నది. వివిధ విభాగాల్లో భారత ఆటగాళ్లు చూపుతున్న ప్రతిభకు వరుసగా పతకాలు వచ్చిపడుతున్నాయి. తాజాగా భారత్ షట్లర్ మనోజ్ సర్కార్ ( Manoj Sarkar ) కాంస్య పతకం కోసం జరిగిన బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ పోరులో అద్భుత విజయం సాధించి మెడల్ దక్కించుకున్నాడు. జపాన్ షెట్లర్ దైసుకే ఫుజిహరాను వరుస సెట్లలో 22-20, 21-13 తేడాతో ఓడించి కాంస్య పతకాన్ని ఒడిసిపట్టాడు. దాంతో ఈ పారాలింపిక్స్లో భారత్ ఇప్పటివరకు సాధించిన మొత్తం పతకాల సంఖ్య 17కు చేరింది. అందులో నాలుగు గోల్డ్ మెడల్స్ ఉన్నాయి.