టోక్యో: ఒలింపిక్స్లో పాల్గొనే అథ్లెట్లు, అధికారులు కరోనా బారిన పడకుండా నిర్వాహకులు కఠిన చర్యలే తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్లేయర్స్ ఆడేటప్పుడు తప్ప మిగతా అన్ని సమయాల్లో మాస్కులు ధరించే ఉండాలని స్పష్టం చేశారు. అయితే తాజాగా మెడల్ గెలిచిన వాళ్లకు మాత్రం ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. వాళ్లు పోడియంపై నిల్చున్న సమయంలో ఫొటోలకు పోజులివ్వడానికి 30 సెకన్ల పాటు మాస్కులు తీసివేసే అవకాశం కల్పించారు.
అయితే ఈ అవకాశాన్ని అథ్లెట్లు దుర్వినియోగం చేయొద్దని నిర్వాహకులు కోరారు. 30 సెకన్ల పాటే ఈ అవకాశం ఇస్తున్నట్లు సోమవారం ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అధికార ప్రతినిధి మార్క్ ఆడమ్స్ వెల్లడించారు. ప్రస్తుతం అథ్లెట్లకు రోజూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక నుంచి మెడల్స్ గెలిచిన వాళ్లు పోడియంపై నిల్చున్న సమయంలో నిర్వాహకులు చెప్పినప్పుడు ఫొటోల కోసం మాస్కులు తీయవచ్చు.