ఫ్లోరిడా: భారత్ మరో సిరీస్పై గురి పెట్టింది. ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నీ సమీపిస్తున్న వేళ సత్తాచాటాలన్న పట్టుదలతో ఉంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమ్ఇండియా శనివారం వెస్టిండీస్తో నాలుగో టీ20లో తలపడనుంది. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నది. అమెరికాలోని భారత అభిమానుల ముంగిట విండీస్ భరతం పట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నది. వెన్నునొప్పి గాయం నుంచి కెప్టెన్ రోహిత్శర్మ కోలుకోవడం జట్టుకు సానుకూలంశం కానుంది. గత మ్యాచ్లో అర్ధసెంచరీ ద్వారా సూర్యకుమార్ యాదవ్ ఫామ్లోకి రావడం జట్టుకు కొండంత బలాన్నిచ్చింది. మిగిలిన రెండు మ్యాచ్ల్లోనూ సత్తాచాటి జట్టు విజయంలో కీలక భూమిక పోషించాల చూస్తున్నాడు. ఫామ్లేమితో సతమతమవుతున్న శ్రేయాస్ అయ్యర్ సత్తాచాటాల్సిన అవసరం కనిపిస్తున్నది. అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్న అయ్యర్.. స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోతున్నాడు. దీనికి తోడు మిడిలార్డర్లో దీపక్ హూడా నుంచి తీవ్రమైన పోటీ నెలకొంది. త్వరలో ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్లేయర్లు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే భువనేశ్వర్కుమార్ నేతృత్వంలోని బౌలింగ్ దళం మెరుగ్గా రాణిస్తున్నది.