చాంద్రాయణగుట్ట: అలియాబాద్ శారదా మహా విద్యాలయం శతాబ్ది వేడుకల సందర్భంగా గురువారం తెలుగు టైటాన్స్ కబడ్డీ జట్టు ప్లేయర్లు స్కూల్ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కబడ్డీ ఆటలో మెళకువలు నేర్పారు. సరదాగా కొద్దిసేపు కబడ్డీ ఆడి సందడి చేశారు. విద్యాలయ ట్రస్టీ సింథోకెమ్ మాట్లాడుతూ ‘విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు.
వందేండ్లుగా పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన బోధన అందిస్తున్న పాఠశాల శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉంది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ జయంత్ ఠాగూర్, కార్యదర్శి మాదిరెడ్డి రామ్, కరస్పాండెంట్ జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.