ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో ఒక హైదరాబాదీ ఆటగాడు.. స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ను దాటేశాడు. ఒక్క పంత్నేకాదు, పృథ్వీ షా, సంజూ శాంసన్ వంటి స్టార్ ప్లేయర్లను దాటేశాడు. అతనెవరో కాదు ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న తిలక్ వర్మ. కేవలం 19 ఏళ్ల వయసున్న తిలక్.. ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొంటూ ముంబై తరఫున అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడాడు. ఆ జట్టు తరఫున ఈ సీజన్లో టాప్ స్కోరర్గా నిలిచాడు.
గురువారం నాడు చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కూడా 34 పరుగులతో అజేయంగా నిలిచి.. కఠినమైన పిచ్పై ముంబైని గెలిపించాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన టీనేజర్గా నిలిచాడు. అంతకుముందు ఈ జాబితాలో రిషభ్ పంత్ తొలి స్థానంలో ఉండగా.. పృథ్వీ షా, సంజూ శాంసన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 2017లో ఢిల్లీ తరఫున 14 మ్యాచులు ఆడిన పంత్ 366 పరుగులు చేశాడు.
అదే జట్టుకు 2019లో ఆడిన పృథ్వీ షా 16 మ్యాచుల్లో 353 పరుగులు చేశాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ తరఫున 2014లో అద్భుతంగా ఆడిన సంజూ శాంసన్ 13 మ్యాచుల్లోనే 339 పరుగులతో రాణించాడు. ఈ సీజన్ ఐపీఎల్లో ఇప్పటి వరకు కేవలం 12 మ్యాచులే ఆడిన తిలక్ వర్మ.. 368 పరుగులతో ఈ జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. ముంబై జట్టు ఇంకో రెండు మ్యాచులు ఆడాల్సి ఉండటంతో తిలక్ మరిన్ని పరుగులు చేసే అవకాశం ఉంది. అంటే ఇప్పుడప్పుడే తిలక్ రికార్డు బద్దలవడం కష్టమే మరి.
What a season it's been for Tilak Varma 👌 https://t.co/vx5Nlhnh2Q #IPL2022 pic.twitter.com/H1lisnjy4K
— ESPNcricinfo (@ESPNcricinfo) May 13, 2022