హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత దిగ్గజ క్రికెటర్ నవాబ్ ఎమ్ఏకే పటౌడీ టీ20 టైగర్ కప్ టోర్నీలో హైదరాబాద్ బాట్లింగ్ విజేతగా నిలిచింది. సోమవారం రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ బాట్లింగ్ జట్టు 3 వికెట్ల తేడాతో ఎవర్గ్రీన్పై విజయం సాధించింది. తొలుత ఎవర్గ్రీన్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 140 పరుగులు చేసింది. రాహుల్ బుద్ది(76) అర్ధసెంచరీతో రాణించాడు. అక్షయ్గౌడ్, వినయ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బాట్లింగ్ టీమ్..వినయ్ (54 నాటౌట్), ప్రతీక్ పవార్ (48) విజృంభణతో 18.2 ఓవర్లలో 141/7 స్కోరు చేసింది. రాహుల్ (3/20), అనికేత్రెడ్డి(2/28) ఆకట్టుకున్నారు. విజేతలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్, కార్యదర్శి విజయానంద్ అభినందించారు.