హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాజ్కోట్ వేదికగా జరుగుతున్న 38వ జాతీయ సబ్జూనియర్ అక్వాటిక్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ స్విమ్మర్ శివానీ కర్రా పసిడి సహా రజతం, కాంస్యంతో మెరిసింది. శనివారం జరిగిన బాలికల 50 మీటర్ల బ్యాక్స్ట్రోక్ పోటీని 34.93 సెకన్లలో ముగించిన శివానీ అగ్రస్థానంలో నిలిచింది.
అదే జోరు కొనసాగిస్తూ 100 మీటర్ల బటర్ఫ్లై విభాగంలో రజతంతో పాటు 4X50 మీటర్ల ఫ్రీైస్టెల్ రిలేలో కాంస్యం ఖాతాలో వేసుకుంది. ఆరేండ్ల వయసు నుంచే స్విమ్మింగ్ నేర్చుకుంటున్న శివానీ ప్రస్తుతం గచ్చిబౌలి స్టేడియంలో ఆయూష్ యాదవ్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నది.