ప్రతిష్ఠాత్మకమైన థామస్ కప్లో స్వర్ణ పతకం సాధించిన భారత బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీ ప్రారంభమై ఇప్పటికి 73 ఏళ్లు గడిచినా.. ఒక్కసారి కూడా భారత్ స్వర్ణ పతకాన్ని ముద్దాడలేదు. ఆ కోరిక నేటితో తీరింది. లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి-చిరాగ్ శెట్టి బృందం వరుసగా మూడు మ్యాచుల్లోనూ గెలుపొంది బంగారు పతకం సాధించింది.
ఈ క్రమంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్.. ఈ బృందానికి కోటి రూపాయల నజరానా ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘14 సార్లు థామస్ కప్ ఛాంపియన్గా నిలిచిన ఇండోనేషియాను టీమిండియా ఓడించి తొలి టైటిల్ గెలిచింది. ఈ అద్భుతమైన ఫీట్ సాధించినం జట్టును గౌరవిస్తూ ఈ బృందానికి రూ.కోటి నజరానా ప్రకటిస్తున్నందుకు భారత క్రీడాశాఖ చాలా గర్విస్తోంది. కంగ్రాచ్యులేషన్స్ టీమిండియా’’ అంటూ అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశాడు.
HISTORY🇮🇳CREATED !
Congratulations to the Indian men’s badminton team’s for winning the Thomas Cup!
This extraordinary feat, with succesive victories over Malaysia, Denmark and Indonesia, calls for matching honour by the nation.
1/2 pic.twitter.com/P3bTgsdtOS
— Anurag Thakur (@ianuragthakur) May 15, 2022
మోదీ కూడా..
థామస్ కప్ తొలి టైటిల్ నెగ్గిన భారత పురుషుల బ్యాడ్మింటన్ బృందానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా అభినందనలు తెలిపారు. దేశం మొత్తం ఈ విజయాన్ని చూసి సంతోషిస్తోందని కొనియాడారు. ‘‘భారత బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించింది. వాళ్లు థామస్ కప్ గెలవడం చూసి భారత దేశం అంతా సంతోషిస్తోంది. ఈ బృందం భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నాను. ఈ విజయం భవిష్యత్తులో ఎందో క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుంది’’ అని మోదీ ట్వీట్ చేశారు.
The Indian badminton team has scripted history! The entire nation is elated by India winning the Thomas Cup! Congratulations to our accomplished team and best wishes to them for their future endeavours. This win will motivate so many upcoming sportspersons.
— Narendra Modi (@narendramodi) May 15, 2022