న్యూఢిల్లీ: ఐపీఎల్గా రూపాంతరం చెందనున్న మహిళల టీ20 చాలెంజ్ ట్రోఫీలో విదేశీ స్టార్ ప్లేయర్లు బరిలోకి దిగనున్నారు. ఇంగ్లండ్ కెప్టెన్ హిథర్నైట్, ప్రపంచ నంబర్వన్ బౌలర్ సోఫీ ఎకల్స్టోన్తో సహా మొత్తం 12 విదేశీ ప్లేయర్లు అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఈనెల 23 నుంచి పుణె వేదికగా మొదలు కానున్న ఈ లీగ్లో మూడు జట్లు మొత్తం నాలుగు మ్యాచ్లు ఆడనున్నాయి.
‘లీగ్లో ఉంటామని హిథర్నైట్ (ఇంగ్లండ్), అలానా కింగ్(ఆస్ట్రేలియా) సమాచారం ఇచ్చారు. వీరితో కలిపి మొత్తం 12 మంది విదేశీ ప్లేయర్లు లీగ్లో ఆడనున్నారు’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మహిళల లీగ్లో ఇంగ్లండ్ నుంచి నైట్, ఎకల్స్టోన్తో పాటు సోఫియా డంక్లీ, డానీ వ్యాట్, దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్ లారా వొల్వార్డ్, మరిజానె కాప్, వెస్టిండీస్ నుంచి దియోంద్ర డాటిన్, హలే మాథ్యూస్ భాగస్వాములు కానున్నారు. ఆస్ట్రేలియా నుంచి అలానా మాత్రమే బరిలోకి దిగనుంది. నిరుడు ఈ టోర్నీ టైటిల్ను స్మృతి మందన నేతృత్వంలోని ట్రయల్ బ్లేజర్స్ జట్టు చేజిక్కించుకోగా.. హర్మన్ప్రీత్సింగ్ బృందం సూపర్నోవాస్ రన్నరప్గా నిలిచింది. ఈసారి ఏ జట్టు టైటిల్ను ఎగరేసుకుపోతుందనేది ఆసక్తికరంగా మారింది.