ODI World Cup | ముంబై : క్రికెట్ వరల్డ్కప్(Cricket Worldcup) జరుగుతున్న స్టేడియాల్లో మ్యాచ్ ముగిసిన తర్వాత భారీగా బాణాసంచా కాలుస్తున్న విషయం తెలిసిందే. అయితే తీవ్ర కాలుష్యంతో సతమతం అవుతున్న ముంబై, ఢిల్లీ నగరాల్లో ఇక నుంచి బాణాసంచా పేల్చడం లాంటి ఘటనలు ఉండవని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి జే షా తెలిపారు. ఈ రెండు నగరాల్లోనూ వాయు కాలుష్యం మరీ అధికంగా ఉందని, అందుకే ఆ నగరాల్లో ఇక నుంచి ఫైర్ వర్క్స్ ఉండవని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఐసీసీకి కూడా చేరవేసినట్లు బీసీసీఐ కార్యదర్శి షా వెల్లడించారు.
గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో సౌతాఫ్రికాతో ఇండియా తలపడనున్నది. వచ్చే సోమవారం ఢిల్లీలోని ఫిరోజ్ షా స్టేడియంలో బంగ్లాదేశ్తో శ్రీలంక ఆడనున్నది. పర్యావరణ అంశాల విషయంలో తాము కట్టుబడి ఉన్నామని, అభిమానులు, స్టేక్హోల్డర్ల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తామని జే షా తన ప్రకటనలో తెలిపారు. శీతాకాల వచ్చేసిన నేపథ్యంలో పర్యావరణ శాఖ ఢిల్లీ ప్రజలకు వార్నింగ్ జారీ చేసింది. నవంబర్ ఒకటో తేదీ నుంచి ఎలక్ట్రిక్, సీఎన్జీ, బీఎస్ -6 డీజిల్ బస్సులను మాత్రమే ఢిల్లీ నుంచి హర్యానా రూట్లో నడిపిస్తామని సీఏక్యూఎం తెలిపింది.