హైదరాబాద్, ఆట ప్రతినిధి: మల్లయుద్ధ రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన ముకేశ్గౌడ్ స్మారక రెజ్లింగ్ టోర్నీలో 17 విభాగాల్లో పోటీలు నిర్వహించారు. మహిళల ఓపెన్ విభాగంలో రోహిణి సత్యశివాని పసిడి పతకం సాధించగా, నేహా, రుబినా భాను రజత, కాంస్యాలు సొంతం చేసుకున్నారు. పురుషుల విభాగంలో భగీరథ్సింగ్, రవిభారత్, కిషన్, అబ్దుల్, లవకుశ, వినోద్, అరవింద్కుమార్, అబ్దుల్లా, మహేంద్ర పసిడి పతకాలు దక్కించుకున్నారు. మొత్తంగా టోర్నీలో పతక విజేతలకు 30లక్షల నగదు బహుమతి అందించినట్లు నిర్వాహకులు విక్రమ్గౌడ్ పేర్కొన్నారు.