బ్రిస్బేన్: వెస్టిండీస్ క్రికెట్ జట్టు సంచలనం సృష్టించింది. 27 ఏండ్ల తర్వాత ఆసీస్ గడ్డపై అదీ గబ్బాలో టెస్టు మ్యాచ్ నెగ్గింది. విండీస్ యువ పేసర్ షామార్ జోసెఫ్ (7/68) నిప్పులు చెరగడంతో ఆసీస్ 8 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 216 పరుగుల లక్ష్యఛేదనలో కంగారూలు 207 రన్స్ చేసి ఆలౌటయ్యారు. (91 నాటౌట్) ఒంటరి పోరాటం వృథా అయింది. బ్యాటింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడి కూడా జోసెఫ్ అద్భుత బౌలింగ్తో కరీబియన్ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టాడు.
అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 311 పరుగులు చేయగా.. అతివిశ్వాసానికి పోయిన ఆస్ట్రేలియా 289/9 వద్ద మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్లో విండీస్ 193 పరుగులు చేసి కంగారూల ముందు మంచి లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. పింక్ బాల్ టెస్టులో ఆసీస్కు ఇదే తొలి ఓటమి కాగా.. సిరీస్ 1-1తో సమమైంది. ఈ మ్యాచ్కు కామెంటేటర్గా వ్యవహరించిన విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా విండీస్ విజయంతో ఆనంద భాష్పాలు రాల్చాడు.