న్యూఢిల్లీ: పరుగుల రాణి పి.టి. ఉష భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధ్యక్షురాలిగా ఎన్నికవడం ఇక లాంఛనమే. ఆదివారం నామినేషన్ల పర్వం ముగియగా.. అధ్యక్ష పదవికి ఉష మాత్రమే నామినేషన్ వేయడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవం కానున్నది. ఈ పదవికి ఎన్నిక కానున్న తొలి మహిళ ఉష. 58 ఏళ్ల ఉష ఆదివారం మరో 14 మంది మద్దతుదారులతో వివిధ పదవులకు నామినేషన్లు దాఖలు చేశారు.
డిసెంబర్ 10న జరిగే ఎన్నికల్లో ఒక అధ్యక్షుడు, ఒక సీనియర్ ఉపాధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, ఒక కోశాధికారి, ఇద్దరు సంయుక్త కార్యదర్శులు, ఆరుగురు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల పదవులకు ఎన్నిక జరుగనుంది. మొత్తం 24మంది వివిధ పదవులకు పోటీలో ఉన్నారు.